టిడిపి నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అరెస్ట్
నెల్లూరు మే19
విద్యుత్ బిల్లులను తగ్గించాలని స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ధర్నా నిర్వహిస్తున్న టిడిపి నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి కరువు నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న సింహపురి ప్రజలపై విద్యుత్తు అదనపు బిల్లులను మోపడం సరికాదని హెచ్చరించారు. మూలిగే వాణి పై తాటికాయ పడ్డట్టు , పనులు లేక ఆర్థికంగా చితికిపోయిన పేద ప్రజల జీవితాలపై విద్యుత్ బకాయిలను మోపడం సరికాదన్నారు. ఈ క్రమంలో సానిక ఒకటో నగర పోలీసులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక భద్రత , దూరం పాటించకుండా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడం సమంజసం కాదన్నారు. నిరుపేద ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించుకుంటే ముందు ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.