YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాతే బస్సులు

ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాతే బస్సులు

ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాతే బస్సులు
విజయవాడ, మే 19,
రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించడంలో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వాములు కావాలని సూచించారు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు తప్ప మిగిలిన అన్నింటినీ కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాలని ఆదేశించారు.రాష్ట్రంలో చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి ప్రతీదీ ఓపెన్‌ చేయాలని సీఎం జగన్ సూచించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలన్నీ ప్రారంభం అవుతాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ రెండు నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ.. మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాలని సూచించారు.రాబోయే రోజుల్లో కూడా మనం కరోనా వైరస్ (కోవిడ్‌–19)తో కలిసి జీవించాల్సి ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా సోకిన వారిని వివక్షతో చూడటాన్ని సమాజం నుంచి తొలగించాలన్నారు. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలని సూచించారు. కరోనా సోకిన వారిని వివక్షతతో చూడకూడదని, రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా అనేది వస్తుంది.. పోతుందని, కాబట్టి ఆ వైరస్ పట్ల భయాన్ని తొలగించాలన్నారు. ప్రజలు తమకు తాముగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచించారు

Related Posts