YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ, మే 19,
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ మరోసారి సమావేశం కానుంది. మోదీ నివాసంలో బుధవారం  ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి, నాలుగో విడత లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న తీరు, మే 31 తర్వాత కరోనా కట్టడికి అనుసరించాల్సిన విధానాలు తదితర అంశాలపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ గత వారం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర భారత్ అభియాన్’ ఆర్థిక ప్యాకేజీపై వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.వీటితో పాటు భారత్‌లో రెండో అతిపెద్ద తుఫాన్‌గా పేర్కొంటున్న ‘అంఫన్’ తుఫాన్‌ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనా కేంద్ర కేబినెట్ దృష్టి సారించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ తుఫాన్ కారణంగా తలెత్తే సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అంఫన్ తుఫాన్‌పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది.శ్రామిక్ రైళ్ల ఏర్పాటు, వలస కార్మికుల తరలింపుతో పాటు ఈ కారణంగా ఉత్పన్నమైన పరిణామాలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రోడ్డు రవాణా సహా పలు అంశాలకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరిస్థితులపై సమీక్షించే అవకాశం ఉంది. డొమెస్టిక్ విమానాలను నడపాలనే డిమాండ్‌పైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts