YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విమర్శలకే పరిమితమయిన విపక్షాలు

విమర్శలకే పరిమితమయిన విపక్షాలు

విమర్శలకే పరిమితమయిన విపక్షాలు
విజయవాడ మే 19
వలస కార్మికులకు అందరికి అండగా ఉంటాం. చంద్రబాబు జూమ్  కి. కన్నా లెటర్ లకు, పవన్ కళ్యాణ్ వీడియో గేమ్ లకు పరిమితమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు  అన్నారు. వలస కార్మికులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నగరం వెంబడి వెళ్ళే వలస కార్మికులకు భోజన సదుపాయం నిమిత్తం ప్రభుత్వం కనకదుర్గమ్మ వారధి, బెంజ్ సర్కిల్,  రామవరప్పాడు  వద్ద ఏర్పాటు  చేసిన ఫుడ్ కౌంటర్ లను మంత్రి మంగళవారం ప్రారంభించారు. త్వరలో వన్ సెంటర్ కుమ్మరిపాలెం వద్ద కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వలస కార్మికులు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని, వారిని వారి స్వస్థలాలకు ప్రభుత్వమే పంపిస్తుంది అన్నారు. మనసున్న ముఖ్యమంత్రి కనుక వారికి అన్ని విధాలాసహకారం అందించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు,  ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చినా వాళ్ళకి వాళ్ల ప్రాంతాలు పంపించేందుకు గాను రైళ్లు, బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో పలు చోట్ల భోజనం పెట్టి వాళ్ళను గమ్యానికి చేరుస్తున్నాం. అనేక స్వచ్చంద సంస్థలు ముందుకి వచ్చి చేయూత అందిస్తున్నారు అన్నారు.  సహాయం చేయకపోగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు కే పరిమితమయ్యారని అయన అన్నారు.

Related Posts