ఒక్క రోజే 5,600 కరోనా కొత్త కేసులు
ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు
న్యూఢిల్లీ / అమరావతి మే 20
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,611 కరోనా కేసులు నమోదయయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 42,297 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 3,303 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 61,149 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 37,136 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 9,639 కరోనా నుంచి కోలుకోగా, 1,325 మంది మృతిచెందారు. ఆ తర్వాత తమిళనాడులో 12,448, గుజరాత్లో 12,140, ఢిల్లీలో 10,554 కరోనా కేసులు నమోదయ్యాయికాగాఆంధ్రప్రదేశ్లో బుధవారం కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,159 మంది సాంపిల్స్ పరీక్షించగా 68 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్థారణయింది. కాగా గత 24 గంటల్లో కొత్తగా 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్ కాగా, కరోనాతో ఇవాళ కర్నూలు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 53కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 715 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.