YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కరెంట్ బిల్లులు రద్దు చేయండి : బాబు

కరెంట్ బిల్లులు రద్దు చేయండి : బాబు

కరెంట్ బిల్లులు రద్దు చేయండి : బాబు
హైద్రాబాద్, మే 20
గుంటూరు నగరంలోని సంపత్‌నగర్‌లో గుడిసెలో ఉండే వ్యక్తికి రెండు నెలల్లో రూ. 3 వేల కరెంటు బిల్లు వచ్చిందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. బుధవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచి పేద ప్రజలు విద్యుత్‌ వాడుకోకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రూ. వేలల్లో వచ్చిన బిల్లులు చూసి ప్రజలు షాక్‌కు గురవుతున్నారన్నారు. ప్రస్తుత లాక్‌ డౌన్‌ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో 3 నెలల పాటు కరెంట్‌ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే విద్యుత్‌ కొరతను అధిగమించి.. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ, వైసీపీ అధికారంలోకి వస్తూనే పీపీఏలపై పడ్డారని మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీలు పెంచలేదని బుకాయిస్తూ శ్లాబ్‌లు మార్చి భారం మోపటం పెద్ద మోసమన్నారు.అసత్యాలు చెప్పడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిద్ధహస్తులని చంద్రబాబు మండిపడ్డారు. ఫ్యాన్‌కు ఓటేస్తే భవిష్యత్తు ఉంటుందని నమ్మినోళ్లు ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్‌ వేయలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. జనాలను మోసం చేసినందుకు సీఎం జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో సహజీవనం చేయాలని సీఎం స్థాయిలో ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. కరోనా వైరస్ అందరికీ రావాలని సీఎం కోరుకుంటున్నారా అని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో ఆడుకోవటం మంచి పద్ధతికాదని చంద్రబాబు హెచ్చరించారు.

Related Posts