YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏపీ, యూపీ, రాజస్థాన్ లో ఉద్యోగాలపై ప్రభావం

 ఏపీ, యూపీ, రాజస్థాన్ లో ఉద్యోగాలపై ప్రభావం

 ఏపీ, యూపీ, రాజస్థాన్ లో ఉద్యోగాలపై ప్రభావం
విజయవాడ, మే 20,
కరనో మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. దాదాపు అన్నీ రంగాలు ఈ మహమ్మారి కారణంగా ఆర్థికంగా అధోగతి పట్టాయి. మనదేశం అందుకు మినహాయింపేమీ కాదు. లాక్‌డౌన్ ప్రభావంతో దాదాపు అన్నీ రంగాలు కుదేలయ్యాయి.అయితే తాజాగా కరోనా ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న దేశీయ రేటింగ్ సంస్థ క్రిసిల్ కొన్ని షాకింగ్‌ నిజాలను వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ అప్పటికే రెవెన్యూ లోటుతో పాటు భారీ అప్పుల్లో కూరుకుపోయిన కొన్ని రాష్ట్రాల పాలిట శాపంగా పరిణమించబోతోందని ఈ సంస్థ అంచనా వేసింది. ఆయా రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీసుకున్నట్లయిందని పేర్కొంది.పెట్రోలియం, మద్యం అమ్మకాలు, స్టాంప్ డ్యూటీలపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్ధాన్ వంటి రాష్ట్రాల్లో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడబోతోందని వెల్లడించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు దేశ ఉత్పత్తిలో 65.5 శాతం వాటా కలిగి ఉన్నాయి.నిర్మాణ రంగంలోనూ ఈ రాష్ట్రాల వాటా 60 శాతంగా ఉందని క్రిసిల్ తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తితో పాటు నిర్మాణ రంగం కుదేలు కావడంతో ఆర్ధిక వ్యవస్ధలపై భారీ ప్రభావం తప్పదని హెచ్చరించింది.

Related Posts