YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
చంద్రబాబు నాయుడు
అమరావతి మే 20
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, ఏపీలో మద్యం, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయని  మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు  దుయ్యబట్టారు. కోర్టు తీర్పులను వైసీపీ నేతలు లెక్కచేయడం లేదన్నారు. టీడీపీ హయాంలో లిడ్ క్యాప్కు భూములు కేటాయిస్తే అమ్ముకుంటున్నారని, కాకినాడ మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజమండ్రి ఆవ భూముల్లో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘కరోనాపై ప్రజలకు సీఎం జగన్ భరోసా కల్పించడం లేదు. కరోనా అందరికీ వస్తుందని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కరోనాపై మేం సలహాలు ఇస్తే పట్టించుకోలేదు. కరోనా లెక్కలను దాచిపెట్టాలని చూసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. కరోనా బాధితులకు సాయం చేస్తామంటే అడ్డుకుంటున్నారు. ఎక్కడా ఎవరూ చేయని తప్పుడు పనులు జగన్ ప్రభుత్వం చేస్తోంది’’ అని చంద్రబాబు తప్పుబట్టారు.

Related Posts