YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఐడీ విచారణకు హాజరైన రంగనాయకమ్మ

సీఐడీ విచారణకు హాజరైన రంగనాయకమ్మ

సీఐడీ విచారణకు హాజరైన రంగనాయకమ్మ
గుంటూరు మే 21
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నా అభియోగాలతో కేసు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ గురువారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెను అధికారులు విచారించారు.   రంగనాయకమ్మ సీఐడీ ఆఫీసుకు వెళ్లముందు ఆమెను సీపీఐ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎలాంటి నేరం చేయలేదన్నారు. ఎల్జీ ప్రమాదంపై ఎం జరిగిందో దానినే తాను పేస్ బుక్లో పెట్టానని వివరించారు. అలా పోస్టులు పెట్టడం తప్పని కూడా తనకు తెలియదన్నారు. సీఐడీ వాళ్లకు ఇదే విషయాన్ని చెబుతానని ఆమె వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని సీఐడీ అధికారులు రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Related Posts