YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతుబందు పధకం కొనసాగించాలి

రైతుబందు పధకం కొనసాగించాలి

రైతుబందు పధకం కొనసాగించాలి అని  బిజెపి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతిపత్రం
 బెల్లంపల్లి మే 21
రైతుబంధు పథకాన్ని వెంటనే అమలు చేసి లక్ష రూపాయల రైతు రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తాండూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాండూరు తహశీల్దార్ కవిత కు వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం మేరకు ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున రైతులకు బ్యాంకు ఖాతాలో  జమ చేయాలన్నారు .రెండో విడత అధికారం లోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికీ రైతు రుణమాఫీ జరగలేదన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎదురుచూడటం జరుగుతుందన్నారు. రైతు రుణాలను వెంటనే మాఫీ చేసి కొత్త రుణాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల భాజపా నాయకులు మహేందర్ గౌడ్ ,శేషగిరి, చిరంజీవి, శ్రీనివాస్, విజయ్, శ్రీకృష్ణదేవరాయలు ,నాగయ్య, కుమార్, అశోక్ ,రాజేంద్రప్రసాద్, సుధీర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts