రైతుబందు పధకం కొనసాగించాలి అని బిజెపి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతిపత్రం
బెల్లంపల్లి మే 21
రైతుబంధు పథకాన్ని వెంటనే అమలు చేసి లక్ష రూపాయల రైతు రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తాండూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాండూరు తహశీల్దార్ కవిత కు వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం మేరకు ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున రైతులకు బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు .రెండో విడత అధికారం లోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికీ రైతు రుణమాఫీ జరగలేదన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎదురుచూడటం జరుగుతుందన్నారు. రైతు రుణాలను వెంటనే మాఫీ చేసి కొత్త రుణాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల భాజపా నాయకులు మహేందర్ గౌడ్ ,శేషగిరి, చిరంజీవి, శ్రీనివాస్, విజయ్, శ్రీకృష్ణదేవరాయలు ,నాగయ్య, కుమార్, అశోక్ ,రాజేంద్రప్రసాద్, సుధీర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.