లక్షలోపు రుణమాఫీ రైతు ఖాతాలో జమచేయాలి
ఆదిలాబాద్ మే 21
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష లోపు రుణమాఫీ అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ డిమాండ్ చేసారు.25 వేలు రైతు ఖాతా జమచేయడం రైతుల ను మోసం చేయడమే అన్నారు. ఒక ఎకరా భూమి ఉన్న రైతులకు బ్యాంక్లు 40 వేల రుణాలు మంజూరు చేశాయని గుర్తు చేశారు వెంటనే బేషరతుగా లక్ష లోపు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రైతు సమతి అధ్యక్షులు దయాకర్, వేణుగోపాల్,అదినాథ్,దినేష్, లాలమున్నా ,జోగు రవి, సోమరవి,జీవన్, తదితరులు పాల్గొన్నారు