YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ లో ఒక్కరోజే 6 వేలతో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి!

భారత్ లో  ఒక్కరోజే 6 వేలతో  విజృంభిస్తున్న కరోనా మహమ్మారి!

భారత్ లో  ఒక్కరోజే 6 వేలతో  విజృంభిస్తున్న కరోనా మహమ్మారి!
ఢిల్లీ  22. ఇండియాలో కరోనా కేసులు రోజురోజకి  పెరుగుతున్నాయి. నిన్నటి వరకు రోజుకు 5 వేల కేసులు నమోదవుతూ ఉండగా, గత 24 గంటల్లో ఏకంగా ఆరు వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం.. మొత్తం 1,18,447 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6088 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 66,331 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 48,533 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అటు.. 3583 మంది వైరస్ సోకి మరణించారు. నిన్న ఒక్క రోజే 148 మంది మృతి చెందారు. అటు.. రాష్ట్రాల వారీగా విజృంభిస్తున్న కరోనా కేసులు :మహారాష్ట్రలో 41,642, తమిళనాడులో 13967, గుజరాత్‌లో 12905, ఢిల్లీలో 11659, రాజస్థాన్‌లో 6227, మధ్యప్రదేశ్‌లో 5981, ఉత్తరప్రదేశ్‌లో 5515, పశ్చిమ బెంగాల్‌లో 3197, ఆంధ్రప్రదేశ్‌లో 2647, పంజాబ్‌లో 2028, బిహార్‌లో 1982, తెలంగాణలో 1699 కేసులు నమోదయ్యాయి.

Related Posts