YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ దొంగ దీక్షలు

టీడీపీ దొంగ దీక్షలు

టీడీపీ దొంగ దీక్షలు
విజయవాడ మే 22
టీడీపీ దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారు. పార్టీ ప్రయోజనాలు తప్ప తెలుగుదేశానికి ప్రజా ప్రయోజనాలు పట్టవు. విద్యుత్ బిల్లుల్లో టారిఫ్ పెంచినట్టు నిరూపించండని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు -సవాల్ విసిరారు. ఐదేళ్లపాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీది. కరోనా కష్టకాలంలో పారిపోయి ఇప్పుడు ఇళ్లలో ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు చేయటం సిగ్గుచేటు. రాష్ట్రప్రజలని గందరగోళానికి గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అయన అన్నారు. పార్టీ మనుగడ కాపాడుకొనేందుకు నీచరాజకీయాలు చేస్తోంది. రైతులకు తొమ్మిదిగంటల పగలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్. మీ పార్టి నేత జేసీ దివాకర్ రెడ్డే మీ దీక్షలు దొంగదీక్షలని చెప్పారు టీడీపీ నేతలు ఎల్లోమీడియా సహకారం తో దుష్ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. పీపీఏ లలో రాష్ట్రాన్ని దోచుకున్నారు. టీడీపీ నేతలు గ్లోబల్స్ లా తయారయ్యారు. టీడీపీ అసత్య ఆరోపణలకు బోండా ఉమా మాటలే నిదర్శనమని అన్నారు. టీడీపీ కి విద్యుత్ శాఖ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. బొప్పన భవకుమార్ సిటీ వైఎస్ ఆర్ సీపీ ఇంచార్జి. విద్యుత్ బిల్లులపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. కరొనకి బయపడి హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబు ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ప్రజలకి తెలుసని అన్నారు. టీడీపీ దొంగదీక్షలవల్ల ఒరిగేదేమీ లేదని అయన అన్నారు.

Related Posts