YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూన్ 17 వరకు వందే భారత్ మిషన్

జూన్ 17 వరకు వందే భారత్ మిషన్

జూన్ 17 వరకు వందే భారత్ మిషన్
న్యూఢిల్లీ, మే 22,
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా రెండు నెలల కిందట అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను నిలివేయగా.. విదేశాల్లో భారతీయులు చిక్కుకున్నారు. వీరిని వెనక్కు రప్పించేందుకు వందే భారత్ మిషన్ ప్రారంభించింది.కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేయడంతో పలు దేశాల్లో భారతీయులు చిక్కుకున్నారు. వీరిని స్వదేశానికి రప్పించడానికి కేంద్రం ‘వందే భారత్’ మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పలు దేశాలకు ప్రత్యేక విమానాలను పంపి, అక్కడ భారతీయులను తరలిస్తోంది. కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ తొలి విడత విజయవంతం కాగా,మే 16న ప్రారంభమైన రెండో విడత మిషన్ శుక్రవారంతో ముగియనుంది.అయితే, దీనిని జూన్ 13 వరకు పొడిగిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. అలాగే, జూన్ 13 తర్వాత మూడో దశ కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 98 దేశాల నుంచి 2.59 లక్షల మంది భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు పేరు నమోదు చేసుకున్నట్టు శ్రీవాస్తవ పేర్కొన్నారు. వీరిలో ఇప్పటికే 23,475 మంది భారత్ చేరుకున్నట్టు వెల్లడించారు. పొడిగించిన రెండో దశ వందే భారత్ మిషన్‌లో 47 దేశాల్లో చిక్కుకున్న భారతీయులను 162 విమానాల ద్వారా తీసుకురానున్నట్టు అనురాగ్ వివరించారు. ఈ మిషన్‌లో భాగంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారిని విమానంలోని ఐసోలేషన్ జోన్‌కు తరలిస్తారు.స్వదేశం చేరుకున్నాక వాళ్లందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, గర్భిణీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు, సముద్ర మార్గం ద్వారా కూడా కొంతమందిని స్వదేశానికి తరలిస్తోంది. ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ తొలి దశలో మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ మగర్‌ నౌకల సాయంతో దాదాపు 900మందిని భారత్‌ తీసుకువచ్చారు.

Related Posts