YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అయోధ్యలో శివలింగం...

అయోధ్యలో  శివలింగం...

అయోధ్యలో  శివలింగం...
లక్నో, మే 22,
అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టి.. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపు 150 ఏళ్ల వివాదానికి తెరపడిన విషయం తెలిసిందే.అయోధ్యలోని రామమందిర నిర్మాణం పనులు ప్రారంభం కాగా.. ఆ ప్రదేశంలోని వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా శివలింగ సహా దేవతమూర్తుల విగ్రహాలు బయల్పడ్దాయి. మందిర నిర్మాణం చేపట్టనున్న స్థలానికి సమీపంలో శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కి ఉన్న ధ్వజాలు బయటపడినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌క్షేత్ర టస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా అవి వెలుగుచూశాయని వివరించారు. వీటిలో ఐదు అడుగుల ఎత్తైన శివలింగం, నల్ల గీటురాయి స్తంభాలు ఏడు, ఎర్ర రాతిఇసుక ధ్వజాలు ఆరు, పలు దేవతా విగ్రహాలు ఉన్నాయి.పది రోజులుగా ఆలయ నిర్మాణ స్థలం వద్ద పనులు జరుగుతుండగా ఇంతకు ముందే కలశం, రాతి పుష్పాల వంటి అనేక ప్రాచీన వస్తువులు కనిపించాయని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ ట్విటర్‌‌లో వెల్లడించారు. ప్రస్తుతం వెలుగుచూసినవన్నీ అయోధ్యలోని పురాతన రామాలయానికి సంబంధించినవేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయోధ్య వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరులో ముగింపు పలికింది. వివాదాస్పద ప్రాంతం హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది. దీనికి బదులుగా ముస్లిం వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది. మరోవైపు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. మందిర నిర్మాణం పనులు దీని ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో రాముడి విగ్రహాన్ని తాత్కాలిక ఆలయంలో మానస్ భవన్‌కు తరలించారు. ఆలయ నిర్మాణ పూర్తయినంత వరకూ విగ్రహం అక్కడే ఉంటుంది.

Related Posts