YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వలస కూలీల బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

వలస కూలీల బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

వలస కూలీల బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
అహ్మదాబాద్‌ మే 23
వలసకూలీలకు ఘోర ప్రమాదం తప్పింది. కర్ణాటకలో చిక్కుకున్న వలసకూలీలతో బెంగళూరు నుంచి జోధ్‌పూర్‌కు బయలుదేరిన బస్సుకు శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ మంటలను ముందే గమనించిన డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ ప్రయాణికులను కిందకు దించిన కాసేపటికే బస్పు పూర్తిగా దగ్ధమైంది.గుజరాత్‌లోని ఖేడా పట్టణానికి సమీపంలో మక్వా గ్రామం వద్ద అహ్మదాబాద్‌ - వడోదర ఎక్‌్్ప్రెస్‌ వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 25 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 28 మంది ఉన్నారు. డ్రైవర్‌ మంటలను గుర్తించడంలో ఏ మాత్రం ఆలస్యమైనా 28 మంది అగ్నికి ఆహుతయ్యేవారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

Related Posts