YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సాగు లాభసాటిగా మారాలి

సాగు లాభసాటిగా మారాలి

సాగు లాభసాటిగా మారాలి
సంగారెడ్డి మే 23
 సంగారెడ్డిలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగింది.  ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ  సాగు లాభసాటిగా మారాలని, అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలని కొత్త విధానం తీసుకొచ్చారు.  ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు, విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ కోత వుండేది. 1.40లక్షల ఎకరాలకు 14వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తాం.  వానాకాలం పంటకు సంబంధించిన 7వేల కోట్ల రూపాయల్లో 3500కోట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ ఖాతాలో జమ చేశాం.  వానా కాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుంది. అది దిగుబడి వచ్చే సమయంలో వర్షం వస్తుంది. అందుకే వేసవిలో మక్కలు వేసుకోవాలి అని చెబుతున్నామని అన్నారు.  ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 3.60లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యం.  వచ్చే సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉంటుంది.  సంగారెడ్డి జిల్లాలో వానకాలంలో 25వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు. రైతులు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి.  కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా.. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.  ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది. అందుకే పంటలు మార్చాలి. జిల్లా అవసరాలకు అనుగుణంగా ఎరువులు తెప్పించాం. * రైతులు ఎరువులు తక్కువగా వినియోగించాలి.  రైతు బంధు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం 20లక్షల రూపాయలు కేటాయించింది.  నాలుగు నెలల్లో నిర్మాణాం పూర్తి చెయ్యాలని అన్నారు. * రైతు బంధు వేదికల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలి.  కొత్త వ్యవసాయ విధానంపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.  ఒకరికొకరు పోటీ పడి నూతన వ్యవసాయ విధానం ముందుకు తీసుకుపోవాలి.  సంగారెడ్డి జిల్లాలో 20503 మంది రైతులకు ఒకే దఫలో రుణ మాఫీ జరిగింది.  మిగిలిన రైతులకు దశల వారీగా మాఫీ చేస్తామని అన్నారు.
 

Related Posts