YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కవితకు కలిసి రాని కాలం...

కవితకు కలిసి రాని కాలం...

కవితకు కలిసి రాని కాలం...
హైద్రాబాద్, మే 25,
గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఓడిన కల్వకుంట్ల కవిత.. ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ కరోనా రూపంలో ఆమెకు చిక్కులు ఎదురవుతున్నాయి.నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు కాలం కలిసి రావడం లేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన ఆమె.. ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని భావించారు. కానీ కరోనా ప్రభావంతో ఆమె కల నెరవేరడానికి సమయం పట్టేలా కనిపిస్తోంది. మార్చి 18న ఎమ్మెల్సీ పదవికి టీఆర్ఎస్ తరఫున కవిత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భాగంగా నామినేషన్లు వేశారు.గత లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని ఈసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జరగకుండా చూడాలని టీఆర్ఎస్ భావించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడం కోసం సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు రెండోసారి వాయిదా పడ్డాయి.లాక్‌డౌన్ కారణంగా ఎన్నికను 45 రోజుల పాటు వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్టు మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే ఛాన్స్ ఉంది. సరిగ్గా గతేడాది మే 23న లోక్ సభ ఎన్నికల్లో షాక్ రూపంలో కవితకు, టీఆర్ఎస్ వర్గాలకు షాక్ తగిలింది. ఓటమి మిగి్లచిన గాయాన్ని దిగమింగి.. మళ్లీ ఏడాది తిరిగేలోగానే ఎమ్మెల్సీగా రాజకీయాల్లో బిజీ అయ్యే అవకాశం ఆమెకు కరోనా వల్ల తాత్కాలికంగానైనా చేజారింది.

Related Posts