YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆలయ భూములపై పోరాటాలకు సిద్దం

ఆలయ భూములపై పోరాటాలకు సిద్దం

ఆలయ భూములపై పోరాటాలకు సిద్దం
విజయవాడ మే 25,
దేవాలయాల భూములు విక్రయిస్తే సహించేదిలేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఆలయాల భూములు విక్రయిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. భక్తులు కానుకగా ఇచ్చిన భూములను పరిరక్షించేలా ప్రభుత్వం చోరవ చూపించాలని కోరారు.కానీ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. నిరర్దక ఆస్తుల పేరుతో భూములు విక్రయించడం దారుణమని చెప్పారు. ఆలయాల భూమి గజం కూడా అమ్మడానికి వీల్లేదన్నారు. కరోనా హడావుడిలో అందరూ ఉంటే సింహాచలం భూములను కబ్జా చేశారని ఆరోపించారు. సింహాచలం భూములను కబ్జాచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాల భూముల పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ...నిరసనలు చేపడతామని తెలిపారు

Related Posts