ఉండవల్లి చేరుకున్న చంద్రబాబు
అమరావతి మే 25
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ 65 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టా రు.చంద్రబాబు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. దీంతో రెండు నెలల తర్వాత ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో చంద్రబాబు తన కుటుంబంతో హైదరాబాద్లోనే ఉండిపోయారు.విశా లో ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించేందుకు అనుమతించాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఆయనకు అనుమతి లభించలేదు. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో నేరుగా విశాఖకు వెళ్లి ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించాల్సి ఉంది. అయితే అక్కడికి విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన పర్యటన కూడా రద్దు అయింది