కోదాడలో పార్టీ శ్రేణులతో మాట్లాడిన చంద్రబాబు
కోదాడ మే 25
వైజాగ్ విమానాశ్రయ ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ నుండి అమరావతికి రోడ్ మార్గాన వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకొని దుర్గాపురం బైపాస్ వద్ద ఐదు నిమిషాలు ఆగారు. అక్కడ టీడీపి నాయకులతో కలిసి వెళ్లిపోయారు. అంతకుముందు కోదాడ బైపాస్ రోడ్డు మీద టీడీపి నాయకులు జెండాలు పట్టుకొని చంద్ర బాబుకి స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల తెలంగాణ, ఆంద్రా సరిహద్దులో కూడా చంద్రబాబు కాన్వాయి ఆగలేదు. అధికారులు ఆపలేదు.