తన ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ ఉంది: కేంద్ర మంత్రి సదానంద గౌడ
హైదరాబాద్ మే 25
కేంద్ర మంత్రి సదానంద గౌడ ఇవాళ ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో వచ్చారు. అయితే ఆయన హోటల్ క్వారెంటైన్కు వెళ్లలేదు. క్వారెంటైన్ నిబంధనలు అందరికీ ఒక్కటే అని, కానీ కొంత మందికి మినహాయింపులు ఉన్నట్లు ఆయన తెలిపారు. నేను ఓ మంత్రిని, ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్కు వెళ్లాల్సిన అవసరం లేదని, తన ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ ఉన్నట్లు కూడా సదానంద గౌడ తెలిపారు. ఫార్మసీ శాఖకు తానే మంత్రిని అని, ఒకవేళ మందులను సరఫరా చేయకుంటే, కేసులు రెట్టింపు అవుతాయన్నారు. దేశమంతా మందులు సరఫరా జరిగేలా చూడాలన్నది తన బాధ్యత అని, ఒకవేళ డాక్టర్లు క్వారెంటైన్ అయితే, మందులు సరఫరా చేసేవాళ్లే క్వారెంటైన్ అయితే, అప్పుడు కరోనా వైరస్ను ఎవరు ఎదుర్కొంటారని మంత్రి అన్నారు. దేశీయ విమానాల్లో కర్నాటక వస్తున్నవారికి ఏడు రోజులు హోటల్ క్వారెంటైన్ తప్పనిసరి చేశారు. ఆ తర్వాత ఏడు రోజుల ఇంట్లో క్వారెంటైన్ కావాలి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది. కానీ ఈ నియమం నుంచి కొందరికి మినహాయింపులు ఉన్నాయి.