YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్ఎస్ అక్రమాలను ఎట్టిపరిస్థితుల్లో ఆపుతాం.

టీఆర్ఎస్ అక్రమాలను ఎట్టిపరిస్థితుల్లో ఆపుతాం.

టీఆర్ఎస్ అక్రమాలను ఎట్టిపరిస్థితుల్లో ఆపుతాం.
ప్రభుత్వ కార్యక్రమాలను కూడా సొంత కార్యక్రమాలుగా మారుస్తున్నారు ఎమ్మెల్సీ రామచందర్ రావు
యాచారం ఎంపీపీ కి ఎమ్మెల్సీ రామచందర్ రావు పరామర్శ
ఇబ్రహీంపట్నం మే 25
ఫార్మాసీటీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో యాచారం ఎంపీపీగా  తనను ఆహ్వానించలేదని అడిగిన సుకన్యను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పోలీసులు నెట్టివేసిన ఘటన తర్వాత అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. ఈ సంఘటనపై ఎంపీపీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఏసీపి, సిఐ పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. బీజేపీ అధినాయకత్వం ఈ విషయం లో తీవ్రంగా స్పందించింది. ఇతర పార్టీ ప్రజాప్రతినిధులపై టీఆర్ఎస్ ఆగడాలను ఎండగడుతున్నారు. యాచారం ఎంపీపీ సుకన్య ని  సోమవారం పరామర్శించిన సందర్భంగా ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా సొంత కార్యక్రమాలుగా మారుస్తున్న క్రమంలో ఎంపీపీ అడ్డుకోగా స్థానిక అధికారులు, పోలీసులు ఎమ్మెల్యే, అధికార పార్టీ చెప్పినట్లు వింటున్నారు. వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతాపార్టీ నాయకులను అధికార పార్టీ నాయకులు భయాందోళనకు గురి చేస్తున్నారు. భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను ఎట్టిపరిస్థితుల్లో ఆపుతాం. ఫార్మసీటీ లో అధికార పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పకుండా పనులు చేస్తున్నారు. అధికార పార్టీ అక్రమాలను ఎండగడతామన్నారు.

Related Posts