ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి మే 25
లాక్ డౌన్ తో హైదరాబాద్ లోనే ఉండిపోయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల తర్వాత సోమవారం మద్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు...లాక్డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో చంద్రబాబు ఏపీకి వచ్చారు. సోమవారం నుంచి విమానాలు నడపాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో విశాఖపట్నం వెళ్లేందుకు డీజీపీని చంద్రబాబు అనుమతి కోరారు.అనుమతి కూడా వచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం సూచన మేరకు ఈరోజు విమానాలను నిలిపివేసి, రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లిలో తన నివాసానికి చంద్రబాబు బయలుదేరారు. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు...అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీలు నిర్వహించారు.