YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
హైద్రాబాద్, మే 26
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై కేసీఆర్ లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన కేసీఆర్‌పై మండి పడ్డారు. తెలంగాణ ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం కోసం రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కేసీఆర్ సర్కారును డిమాండ్ చేశారు. గతంలోనూ బండి సంజయ్ కేసీఆర్‌కు లేఖలు రాశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ. 216 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి రూ. 224 కోట్లు, పీఎం కేర్స్ నుంచి రూ. 3100 కోట్లు, డివాల్యుయేషన్ నిధుల్లో భాగంగా తొలి విడతలో రూ. 982 కోట్లను తెలంగాణకు కేంద్రం కేటాయించిందని బండి సంజయ్ తెలిపారు.ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బండి సంజయ్‌ సోమవారం సాయంత్రం 6 గంటలకు భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పని చేయడం... ఇరు పార్టీలను బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని సమాచారం. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలను చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి భేటీ కావడంతో వీరిద్దరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Posts