సాగునీటి రంగం నిర్లక్ష్యం
కడప మే 26
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రమని, కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం ఇచ్చాయని, దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కడప జిల్లా వేంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. మ్యాన్ ఫెస్ట్ ప్రకారం ప్రతి రైతుకు ప్రతి ఏడాదికి 12500 రూపాయలు ఇవ్వాలి.. కానీ ఒక్కసారిగా అందులో ఐదు వేల రూపాయలు కోత విధించారని చెప్పారు. రైతు రుణమాఫీ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారన్నారు. సొంత నియోజకవర్గంలోనే చిన్నరంగాపురం గ్రామంలో బాల్ రెడ్డి అనే రైతు చీనీ పంట పండి అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వ్యవసాయంపై సూచనలు ఇవ్వమని ప్రభుత్వం అడిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన సూచనలు చేస్తుందని చెప్పారు అందులో మొదటిది. రైతు భరోసా క్రింద 12500 రూపాయలు ఇవ్వాలన్నారు. రైతు రుణమాఫీ కింద ఎనిమిది వేల వందల కోట్లు పెండింగ్ ఉంది అది ఇవ్వాలన్నారు. ధరల స్థిరీకరణ నిధిని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి వచ్చే ఏడాదైనా అధిక నిధులు కేటాయించాలని చెప్పారు.