YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బలహీనవర్గాలకు చెందిన వ్యక్తినని చెప్పుకోవడం సిగ్గు చేటు : కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

బలహీనవర్గాలకు చెందిన వ్యక్తినని చెప్పుకోవడం సిగ్గు చేటు  : కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినంటూ మోదీ చెప్పుకోవడం సిగ్గు చేటని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.  భార్య జశోదాబెన్ కు యాక్సిడెంట్ జరిగితే, కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లనటువంటి దారుణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మోదీ అని మండిపడ్డారు. భార్యనే పట్టించుకోని వ్యక్తి... బయటి మహిళల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఓ రోడ్ యాక్సి డెంట్ లో మోదీ భార్య జశోదాబెన్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మోదీ స్పందించలేదు.

Related Posts