వరంగల్ ఘటన… పోలీసు వెర్షన్ పై మక్సూద్ కుటుంబసభ్యుల అభ్యంతరం
వరంగల్ మే 26
రాష్ట్రవ్యప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసుకు సంబంధించి పోలీసులు చెప్పిన విషయాలపై మక్సూద్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం మక్సూద్ కుటుంబ సభ్యులు వరంగల్కు చేరుకున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి వరంగల్ ఎంజీఎంకు వచ్చిన కుటుంబ సభ్యులు హత్య ఉదంతంపై మాట్లాడారు. హత్యపై పోలీసులు చెప్పిన విషయాలపై వారు వ్యాఖ్యానిస్తూ సంజయ్ యాదవ్ ఒక్కడే తొమ్మిది మందిని తీసుకెళ్లి బావిలో ఎలా పడేస్తాడని, అది నమ్మశక్యంగా లేదని అన్నారు. అది అసాధ్యమని వారు అభ్యంతరం వ్యక్తం చేసారు. సంజయ్తో పాటు మరికొంత మంది ఈ కేసులో పాల్గొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మళ్లీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతదేహాలకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని మక్సూద్ కుటుంబసభ్యులు తెలిపారు.