YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వేలం ఆపినందుకు కృతజ్ఞతలు

వేలం ఆపినందుకు కృతజ్ఞతలు

వేలం ఆపినందుకు కృతజ్ఞతలు
రాజమండ్రి మే 26
హిందూ బంధువుల ఆందోళన రాకముందే వేలం నిలిపినందుకు సీఎం జగన్‌కు స్వామి పరిపూర్ణానంద కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎంకు పరిపూర్ణానంద లేఖ రాశారు. ఇప్పటిదాకా పని చేసిన సీఎంలు దేవుళ్లకు, హిందువులకు ఒరగబెట్టింది ఏమీలేదని వ్యాఖ్యానించారు. వారి నిర్వాకం వల్లే 5 లక్షల కోట్ల పంట భూములు, లెక్కలేని ఆభరణాలు దోపిడీ కాబడ్డాయి అన్నది అక్షర సత్యమన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరంలో మీడియాతో మాట్లాడుతూ దేవాలయ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజలు అందించిన ఆస్తుల వివరాలు వారికి తెలియ చెప్పడంలో తప్పులేదన్నారు.ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఈ పని మీరు చేస్తే నమ్మి ఓటు వేసిన హిందువులందరికీ న్యాయం చేసినవారవుతారని... చరిత్రలో మిగిలిపోతారని స్వామి పరిపూర్ణానంద లేఖలో పేర్కొన్నారు.

Related Posts