పంజాబ్ నుండి బూర్గంపాడు చేరిన తప్పిపోయిన వ్యక్తి
భద్రాద్రి కొత్త గూడెం మే 26
రక్త సంబంధాలు ఎంతో గొప్పవని, వాటికి వెలకట్టలేమని చాటి చెప్పారు బూర్గంపాడుమండలం పినపాక పట్టి నగర్ కు చెందిన రోడ్డా వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు. అతను నడవడానికి ఇతరుల సహాయం తీసుకుంటున్నా, మూగా, చెవిటి అయినా తన తండ్రి ఇంట్లో ఉంటే చాలు అనే కోరిక తో గత రెండు సంవత్సరాలు క్రితం కూలీ పనికి వెళ్లి తప్పిపోయి పంజాబ్ రాష్ట్రంలో ని లూథియానా లో ఉన్నట్లు ఇటీవలే ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులు, స్థానికులు సహకారం తో పంజాబ్ నుండి బూర్గంపాడు కు తిరిగి మంగళవారం ఇంటికి తీసుకువచ్చారు. రోడ్డా వెంకటేశ్వర్లు ఇంటికి రాగానే భార్య, కూతురు ఒక్కసారిగా హత్తుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. స్థానికు లు అతన్ని చూడటానికి వారి ఇంటికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులు అందరు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా టిక్... టాక్ ద్వారా జరగడం విశేషం. టిక్ టాక్ లో పోస్ట్ పెట్టిన పంజబీ వ్యక్తి కి, స్థానిక పోలీసులకు, స్థానిక నేతలు కు ,మీడియా కి కుటుంబికులు ధన్యవాదాలు తెలిపారు