ఉద్దవ్ను కలిసిన శరద్..నెలకొన్న ఉత్ఖంత
ముంబై మే 26
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్ మాతోశ్రీ నివాసంలో కలుసుకున్నారు. శివసేన నేతృత్వంలోని కూటమిలో చీలకలు వచ్చినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరూ భేటీ అయినట్లు తెలుస్తోంది. కానీ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని శివసేన స్పష్టం చేసింది. నిజానికి ఠాక్రే, శరద్ పవార్లు గంటన్నర సేపు చర్చించుకున్నారని, ప్రభుత్వ స్థిరత్వంపై ఎవరన్న కామెంట్ చేశారంటే, అది వారి కడుపు నొప్పిగా భావించాలని సంజయ్ రౌత్ విమర్శించారు. తమ ప్రభుత్వం బలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంట్లో ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు.లాక్డౌన్ తర్వాత పరిణామాలపై మాతోశ్రీ నివాసంలో ఠాక్రేతో శరద్ చర్చించినట్లు భావిస్తున్నారు. లాక్డౌన్ను నెమ్మదిగా సడలిస్తూ, ఆర్థిక కార్యక్రమాలను పునర్ ప్రారంభించాలని శరద్ సూచిస్తున్నారు. కానీ ఠాక్రే మాత్రం కఠిన నియమాళిని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ అంశంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తమ మధ్య ఎటువంటి సమస్యలు లేవని రెండు పార్టీలు స్పష్టం చేశాయి. అధికారం కోసం కాచుకు కూర్చున్న బీజేపీయే ఈ ఆరోపణలు చేస్తున్నట్లు రెండు పార్టీలు పేర్కొన్నాయి.