YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట మే 26 
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం దాతర్ పల్లి గ్రామంలో రైతు శ్రేయస్సు ప్రభుత్వ సంకల్పమని వానా కాలం -2020 నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదతరులు హజరయ్యారు.   దాతర్ పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ప్రాధాన్యత పంటల సాగుకు మేము సైతమని మంత్రి హరీష్ రావు సమక్షంలో ప్రతినబూని, గ్రామ పంచాయతీ తరపున తీర్మాణ పత్రాన్ని రైతులు మంత్రికి అందించారు.  పీఏసీఏస్, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో దాతర్ పల్లి గ్రామంలోనే ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు ఎరువులను మంత్రి పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ  నియంత్రిత పంట సాగు కాదు.. ఇవాళ్టి నుంచి ప్రాధాన్య పంట సాగు అందాం.  రైతే రాజు కావాలన్నది.. నినాదం. కానీ విధానంగా మారాలి.   దాతర్ పల్లి అంటే.. ఆదర్శమని, పోయిన యేడాది సన్నరకం వరి పండించి సేంద్రీయ ఎవుసం చేశామని, ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ రైతు తనకు బస్తా ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు.   రైతుకు మేలు జరగలన్నదే.. సీఏం కేసీఆర్ ధ్యేయం.  ఈ నెల 29వ తేదీనముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ ప్రారంభం అవుతుందని అన్నారు. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, కాలిపోయే మోటార్లతో ఒకప్పుడు రైతు బతుకు వెళ్లదీసే వారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క గుంట ఎండలేదు, ఒక గంట కరెంటు పోలేదు.   నాడు ఎరువులు కావాలంటే.. క్యూలో నిల్చొవాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ మీ ఊర్లకే మందు యూరియా బస్తాలు పంపుతున్నాం.   ఒకప్పుడు పంట పెట్టుబడి కోసం..షావుకారు దగ్గర రైతు అప్పు తెచ్చెదని, కానీ సీఎం కేసీఆర్ సర్కారులో రైతుబంధు కింద పెట్టుబడి సాయం కేసీఆర్ అందిస్తున్నారు.   కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు కింద 7 వేల కోట్లు బ్యాంకులో వేయమని, రెండు విడతల రైతుబంధు కింద రూ.14 వేల కోట్లు బరాబర్ ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ మాకు చెప్పారని మంత్రి వెల్లడించారు.   25 వేలలోపు ఉన్న వారందరికీ వారం రోజుల్లో రుణమాఫీ చేయనున్నాం. లక్షలోపు ఉన్న వారందరికీ నెల రోజుల్లో రుణమాఫీ చేస్తామని మంత్రి అన్నారు.

Related Posts