YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్యే

 వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్యే

 వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్యే
విజయవాడ, మే 26,
ఇప్పటికే ఎమ్మెల్యేతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ బడా నేతలతో చర్చలు జరిపారట. మంగళవారం సాయంత్రం సీఎం జగన్‌ను కలుస్తారనే చర్చ నడుస్తోంది.మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌పై చర్చ మొదలైంది. టీడీపీకి షాకిస్తూ మరో ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీలోకి వెళతారనే ప్రచారం మొదలైంది.ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ బడా నేతలతో చర్చలు జరిపారట. దీనిపై ఏలూరి కూడా స్పందించకపోవడంతో పార్టీ మారడం ఖాయమంటున్నారు.ఇటు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారడం లేదని.. ఆ వార్తల్ని నమ్మొద్దంటున్నారు. తనతో ఎవరూ చర్చలు జరపలేదన్నారు. రాజకీయంగా తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు.ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు (వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం) ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. అధికారికంగా వైఎస్సార్‌సీపీలో చేరకపోయినా.. సీఎంకు మద్దతు పలికారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక అధికార పార్టీకి జై కొడితే మొత్తం ఆరుగురు దూరమైతే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోయినట్లే.

Related Posts