YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అంటు వ్యాధులతో జరాభద్రం

అంటు వ్యాధులతో జరాభద్రం

అంటు వ్యాధులతో జరాభద్రం
న్యూఢిల్లీ, మే 27
లాక్‌డౌన్ తదితర కట్టుదిట్టమైన చర్యలతో పలు దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగాయి. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను సడలిస్తున్నాయి. భారత్ సహా పలు దేశాల్లో ఆంక్షలు సడలించడంతో ప్రజా జీవనం క్రమంగా యథాతథ స్థితికి చేరుకుంటోంది. మరి వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే వివిధ కార్యకలాపాలకు అనుమతిస్తే, లాక్‌డౌన్ ఎత్తివేస్తే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించదా..? సగటు మానవుడికి వచ్చే సందేహం ఇది. దీనికి ఔననే సమాధానం చెప్తున్నారు నిపుణులు.కట్టుదిట్టమైన చర్యల ద్వారా కరోనా వైరస్‌ను అరికట్టిన దేశాలు ఇప్పుడు ఆ నిబంధనలను వెంటనే సడలిస్తే.. రెండోసారి వైరస్ విజృంభించవచ్చని, ఈసారి తారాస్థాయిని చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన నిపుణుడు డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ హెచ్చరిస్తున్నారు. ప్రపంచం ఇంకా కరోనా వైరస్‌ మొదటి దశకు మధ్యలోనే ఉందని ఆయన చెప్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగానికి నాయకత్వం వహిస్తున్న మైక్‌ ర్యాన్‌ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లాంటి దేశాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉందని మైక్ ర్యాన్ తెలిపారు. వైరస్ మరోసారి ఎప్పుడైనా దాడి చేయొచ్చని హెచ్చరించారు. ఓ మీడియా ప్రతినిధితో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘అంటువ్యాధులు దశల వారీగా దాడి చేస్తాయి. మొదటి దశ తీవ్రత కొద్దిగా తగ్గిన దేశాల్లో సంవత్సరాంతంలో మళ్లీ దాని ప్రభావం కనిపిస్తుంది. తొలి దశ కట్టడికి తీసుకున్న చర్యలను వెంటనే నిలిపివేస్తే మరోసారి వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది’ అని మైక్ ర్యాన్ పేర్కొన్నారు.‘వైరస్ ఇప్పుడు తగ్గుముఖం పడుతోందని.. మరోసారి రావడానికి నెలల పాటు సమయం ఉంటుందని మనం అనుకోలేం. వైరస్ ఎప్పుడైనా దాడి చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న దశలోనే ఎక్కువ కేసులు నమోదు కావొచ్చు’ అని మైక్ వ్యాన్ అన్నారు. వివిధ రంగాలపై ఆర్థికంగా పెను ప్రభావం పడుతుండటంతో కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ను పలు దేశాలు దశలవారీగా సడలిస్తున్న నేపథ్యంలో మైక్ వ్యాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి

Related Posts