YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 వరి ధాన్యానికి 92 కేంద్రాలు

 వరి ధాన్యానికి 92 కేంద్రాలు

 వరి ధాన్యానికి 92 కేంద్రాలు
వరంగల్, మే 27,
 కాలం కలిసి రావడంతో చేతికొచ్చిన పంటను చూసి ఆనందపడాలా... రోజులు గడిచిపోతూ అకాల వర్షం కురుస్తున్నా కాంటాలు కాకపోవడంతో ఆందోళన చెందాలా... కాంటాలు అయినా ధాన్యాన్ని తరలించకపోవడంతో దిగులు పడాలా... ఇవీ అన్నదాతల సందేహాలు! కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేయకపోగా, తూకం వేసిన ధాన్యాన్ని సైతం తరలించేందుకు లారీలు పంపించకపోవడంతో నిద్ర, ఆహారం మానుకుని నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలుకేంద్రాల వద్ద కుప్పలుగా ధాన్యం పేరుకుపోతున్నా అధికారుల పట్టింపులేని తనం రైతుల ఆందోళనకు కారణమవుతోంది. ఓ దశలో రైతులు ఐకేపీ, పీఏసీఎస్‌ నిర్వాహకులతో గొడవకు దిగుతున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి.వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 92 కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లాలోని వరంగల్, కాజీపేట, ఖిలా వరంగల్, ఐనవోలు, హసన్‌పర్తి, హన్మకొండ, ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 29 కొనుగోలు కేంద్రాలు ఐకేసీ ఆధ్వర్యాన మిగిలిన 63 కేంద్రాలు ఆయా మండలాల్లోని పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన నిర్వహిస్తున్నారు. ఈసారి టోకెన్‌ పద్ధతి ప్రారంభించిన అధికారులు టోకెన్లల తేదీల వారీగానే రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఇంత వరకు బాగానే ఉన్నా... కేంద్రాలకు తీసుకొచ్చిన వారి ధాన్యాన్ని కాంటా వేయడంతో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకవేళ కాంటా పూర్తయినా మిల్లులకు తరలించడంలో లారీల కొరత కారణంగా జాప్యం జరుగుతుండడంతో రైతులే కాపలా ఉండాల్సి వస్తోంది.ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం పేరుకపోయ్యింది. జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాలు నిర్వహిస్తుండగా, ఒక్కో కేంద్రం ప్రస్తుతం 10 నుంచి 90 లారీలకు సరిపడా ధాన్యం నిల్వ ఉన్నట్లు అంచనా. ఇందులో చాలా వరకు తూకం వేయని ధాన్యమే ఉండడం గమనార్హం. హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్‌ ప్రాథమిక వ్యవసాయ ప్రాధమిక సహకార కేంద్రం వద్ద 60లారీలు, బైరాన్‌పల్లి కేంద్రం 20 లారీలు, మల్లారెడ్డిపల్లిలో 40 లారీలు, సూదన్‌పల్లి కేంద్రం వద్ద 20లారీలు, నాగారం వద్ద 90 లారీలు, అన్నాసాగరం వద్ద 15 లారీలు, దేవన్నపేట వద్ద 10 లారీలు, సీతంపేట వద్ద 15లారీలు, ఎల్లాపురం వద్ద 10లారీలు, జయగిరి వద్ద15 లారీలు, గంటూరుపల్లి వద్ద 15 లారీలు, పెంబర్తి వద్ద 10లారీలు, పెగడపల్లి వద్ద 30 లారీలకు సరిడా ధాన్యం నిల్వ ఉందని రైతులు చెబుతున్నారు. కాగా, ఇందులో చాలా మంది రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటుతోందని తెలుస్తోంది. కాంటా పూర్తికాక ముందే వర్షం వస్తే తడిచిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.ఒక కేంద్రానికి లారీ పంపిస్తే.. మరో నాలుగు రోజులు గడిస్తే తప్ప లారీ రావడం లేదని సమాచారం. మిల్లుల వద్ద ధాన్యం దింపడానికి హమాలీల కొరత కారణంగా సమయం పడుతుండగా.. లారీలు కూడా సరిపడా సమకూర్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా, ధాన్యం తీసుకెళ్లడానికి లారీలు పంపించాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఆర్టీఏ అధికారులకు అప్పగించింది. దీంతో నాలుగు రోజుల క్రితం బాహుపేట ఆర్టీఏ అధికారులకు ఒక ఖాళీ లారీను  ఆపి «వంగపహాడ్‌లోని ధాన్యం కేంద్రానికి పంపించారు. ఇద్దరు రైతులను ఆ లారీలో ఎక్కించారు. అయితే లారీ డ్రైవర్‌ మధ్యలోనే రైతులను దింపేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు సాయంత్రం వరకు వారు ఇంటికి చేరుకోకపోవడంతో పీఏసీఎస్‌ చైర్మన్‌ తన బైక్‌పై వారిని తీసుకురావాల్సి వచ్చింది. ఇకనైనా లారీ అసోసియేషన్ల బాధ్యులు, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ సభ్యుల సమన్వయంతో లారీలను సమకూర్చి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.

Related Posts