తెలంగాణ రాష్ట్ర డిజిపి(రెగ్యులర్)గా ప్రస్తుత ఇన్ చార్జి డిజిపి ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. డిజిపి నియామకానికి సంబంధించి ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ కొత్త చట్టం తెచ్చింది. డిజిపిని నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగిస్తూ అసెంబ్లీ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం డిజిపిగా మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి గత ఏడాది నవంబర్ 12 నుంచి ఇన్చార్జి డిజిపిగా కొనసాగుతున్నారు.