YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టి.డి.పి పైలాన్ వద్ద మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మహానాడు కార్యక్రమం

టి.డి.పి పైలాన్ వద్ద మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మహానాడు కార్యక్రమం

టి.డి.పి పైలాన్ వద్ద మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మహానాడు కార్యక్రమం
విశాఖపట్నం మే 27 
జాతీయ రహదారికి ఆనుకునివున్న  టి.డి.పి పైలాన్ వద్ద మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బుధవారం మహానాడు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి వలన మహానాడు కార్యక్రమం జూమ్ యాప్ లో నిర్వహిస్తున్నామన్నారు . ఈ కార్యక్రమం లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14000 మంది టి.డి.పి కార్యకర్తలు , నాయకులు పాల్గొని వీక్షిస్తారని అన్నారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులనీ ,అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాల పై మహానాడు కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 79,85,87,88 వార్డు టి.డి.పి నాయకులు రౌతు శ్రీనివాసరావు, బలిరెడ్డి నాగేశ్వరవు,ముత్యాలు,బులెట్ రాజు సీనియర్ టి.డి.పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts