వైసీపీ రంగులపై విచారణ శుక్రవారానికి వాయిదా
అమరావతి మే 28
ప్రభుత్వ కార్యాలయాలకు రంగులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం న్యాయస్థానం శుక్రవారం నాటికి వాయిదా వేసింది. హైకోర్టుకు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ హాజరయ్యారు. తొలిసారిగా ఏపీ సీఎస్ నీలం సాహ్నీ కూడా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీకి చెందిన రంగులు వేశారంటూ పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయస్థాయం విచారణ చేపట్టింది. రంగులను తొలగించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుకు భిన్నంగా 620 జీవో తీసుకువచ్చి గతంలో రంగులతో పాటు మట్టి రంగును కలిపి వేస్తున్నట్లు పిటిషన్ లో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు దానిపై కూడా విచారణ చేపట్టింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో వివరణ ఇచ్చేందుకు సీఎస్ కోర్టుకు వచ్చారు.గా ఇదే అంశంపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించచింది. హైకోర్టు సర్కార్ వాదనలను వింటూ తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది.