రుతుస్రావం పై అమ్మాయిలనే కాదు...అబ్బాయిలను ఎడ్యుకేట్ చేయండి
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పిలుపు
న్యూఢిల్లీ మే 28
రుతుస్రావం అనేది సిగ్గుపడాల్సిన అంశం కాదు. అది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. ఈ విషయంలో అమ్మాయిలనే కాదు అబ్బాయిలను ఎడ్యుకేట్ చేయాల్సిందిగా కేంద్ర మహిళా-శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. నేడు మెనుస్ట్రియల్ హైజిన్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. జన్ ఔషది కేంద్రాల్లో అందుబాటు ధరలకే శానిటరీ నాప్కిన్్ిను లభిస్తున్నయన్నారు. దేశంలోని మహిళలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత, రుతుస్రావంపై అవగాహన కల్పించే నిమిత్తం ప్రతీ ఏడాది మే 28న మెనుస్ట్రియల్ హైజిన్ డే ను నిర్వహిస్తున్నారు.