YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా సర్కార్ లో మహిళలకు సముచిత స్థానం

వైకాపా సర్కార్ లో మహిళలకు సముచిత స్థానం

వైకాపా సర్కార్ లో మహిళలకు సముచిత స్థానం
ఏలూరు మే 29
గత ప్రభుత్వాలు నెరవేరని హామీలు గుప్పించి మహిళలను మోసం చేశాయని, ఇచ్చిన హామీలకు కట్టుబడి మహిళలకు క్యాబినెట్ లో, ఇతర రంగాలలో సముచిత స్థానం కల్పించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఎపి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు కోసం అనేక చట్టాలు, పదాకాలు ప్రవేశ పెట్టిందని, ఎపి లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే బెల్టు షాపులు మూయించి, దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేయడం జరిగిందని ఆమె అన్నారు. కరోనా కష్టకాలాన్ని సైతం లెక్కచేయకుండా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నెవేర్చారని మంత్రి వనిత తెలిపారు.

Related Posts