వరంగల్ పట్టణాభివృద్ది పనులు వీలైనంత త్వరగా పూర్తి: దాస్యం
వరంగల్ మే 29
వరంగల్ పట్టణాభివృద్ది పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి నగర వాసులకు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ బస్టాండ్ జంక్షన్ అభివృద్ధి పనులను వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిలతో కలిసి భూమి పూజ చేశారు. కోటి 90 లక్షల రూపాయలతో చేపట్టనున్నఈ అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గతంలో పట్టణంలో వర్షపు నీరు రోడ్ల మీద నిలిచి రహదారులు గుంతలతో నిండి ఇబ్బందికరంగా ఉండేదన్నారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే హన్మకొండ పట్టణంలో ఉన్నఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వినయ్ భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో కుడా ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.