YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసింది : పవన్

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసింది : పవన్

 హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసింది : పవన్
హైద్రాబాద్, మే 29
ఏపీ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఏపీలో ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ స్పందించారు.. 'ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది' అంటూ ట్వీట్ చేశారు.ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన్ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ మళ్లీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టొచ్చని లాయర్లు చెబుతున్నారు.

Related Posts