YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 అజిత్ జోగి కన్నుమూత

 అజిత్ జోగి కన్నుమూత

 అజిత్ జోగి కన్నుమూత
రాయ్ పూర్, మే 29
త్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి ఇకలేరు. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన రాయ్‌పూర్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. మే 9న ఉదయం ఆయనకు గుండెపోటుకు గురైన ఆయన.. ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను పిలిపించగా.. జోగిని పరీక్షించి డాక్టర్లు గుండెపోటుగా నిర్ధారించారు. అనంతరం ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అమిత్ జోగి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిలో 2000 నుంచి 2003 వరకు కొనసాగారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్‌పూర్‌లో జన్మించిన అజిత్ ప్రమోద్ కుమార్ జోగి.. భోపాల్‌లోని మౌలానా అజాద్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం పూర్తిచేసి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అజిత్ జోగి.. పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. తర్వాత 1981 నుంచి 85 వరకు భోపాల్, ఇండోర్ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌లోని మహాసముద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆయన చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అప్పటి నుంచి చక్రాల కుర్చీ మీదే రాజకీయాలు నడిపారు. విభేదాలు కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన అజిత్ జోగి.. జనతా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు.అజిత్ జోగిని వివాదాలు కూడా వెంటాడాయి. 2003 నాటి ఎన్సీపీ నేత హత్యకేసులో జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగిని 2007లో సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే, ఆయన ఎస్టీ కాదంటూ 2019లో ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిటీ ఆయన కుల ధ్రువీకరణ పత్రాలను రద్దుచేసింది.
 

Related Posts