YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ కేసు వివరాలివే

నిమ్మగడ్డ కేసు వివరాలివే

నిమ్మగడ్డ కేసు వివరాలివే
గుంటూరు, మే 29,
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను నియమించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన న్యాయస్థానం.. రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని తీర్పు ఇచ్చింది. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.రాష్ట్రవ్యాప్తంగా అందరిలో ఉత్కంఠరేపిన ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగిందో ఓసారి చూస్తే.. 2016 జ‌న‌వ‌రి 30న ఏపీ ఎస్‌ఈసీగా నిమ్మగడడ్డ రమేష్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. ఆయన కూడా అన్ని ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. 2020 మార్చిలో ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజ‌ర్వేష‌న్ల అంశంలో మార్పుల‌తో స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియను నిమ్మగడ్డ చేప‌ట్టారు. మార్చి‌లో జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌లు సహా మునిసిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల‌కు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎన్నికల షెడ్యూలు కూడా విడుదల చేసి నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు.ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణను వాయిదా వేస్తూ మార్చి 15న రమేష్‌కుమార్‌ ప్రకటించారు. ఈ నిర్ణయంపై సీఎం జగన్‌, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని, వైద్యఆరోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ సీఎస్‌ నీలం సాహ్ని ఎస్‌ఈసీకి లేఖ రాశారు.జగన్ సర్కార్ ఏపీ ఎస్ఈసీ పదవి కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ 2020, ఏప్రిల్ 10న ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసింది.. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. తర్వాత రాష్ట్ర న్యాయ శాఖ ఆమోదం తెలపింది. వెంటనే రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పదవికాలం మూడేళ్లు గడచిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. న్యాయ శాఖ జీవో 31, పంచాయతీరాజ్ శాఖ 617, 618 జీవోలు ఇచ్చాయి. దీంతో ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవిని నుంచి తొలగించారు. ఆ తర్వాత జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించారు.ఏప్రిల్ 12న తనను తొలగిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ తర్వాత నేరుగా విచారణ కొనసాగింది. 2020 ఏప్రిల్ 18.. వైద్య ఆరోగ్య శాఖ‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని సంప్ర‌దించ‌కుండా నిమ్మగడ్డ నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని సవాలు చేస్తూ ప్ర‌భుత్వం కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేసింది. 2020 మే 29.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నింటినీ హైకోర్టు కొట్టేస్తూ తీర్పునిచ్చింది. తిరిగి సీఈవోగా నిమ్మగడ్డ కొనసాగాలని ఆదేశించింది. జీవో 618ను కొట్టేసింది.

Related Posts