YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం

సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం

సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం
విజయవాడ, మే 29,
నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ (ఎస్ఈసీ)గా తిరిగి నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామ‌ని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు వెల్లడించారు. శుక్రవారం తాడేప‌ల్లిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయ‌గా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయారని, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియమించినట్లు వెల్లడించారు. దీనిపై టీడీపీ, బీజేపీ నేతలు హైకోర్టుకు వెళ్ళారని, ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ జీవోల‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువ‌రించిందన్నారు. అయితే ఒక్కో స‌మ‌యంలో న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చని, అలాంట‌ప్పుడు పై కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ కేసుపై న్యాయ‌ నిపుణుల‌తో సంప్రదింపులు జ‌రుపుతున్నామ‌ని వెల్లడించారు.ఎన్నికల్లో మద్యం, డబ్బు అరికట్టాలని చట్టం తీసుకొస్తే దానిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పంపిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకం పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇలాంటి లేఖల వల్ల ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంద‌ని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబ‌ద్ధంగా, రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చామ‌ని, దీని వల్ల నిమ్మగడ్డ పదవి కోల్పోయారని అంబటి పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును ప‌రిశీలించి అభ్యంతరాలు ఉంటే పై కోర్టుకు అప్పీలు చేస్తామన్నారు.చంద్రబాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో సైతం చాలాసార్లు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారాలు ఏమిటో తమకు తెలుసన్నారు. ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఎలా ఉంటాయో మిగతా వ్యవస్థలకు పరిమితికి లోబడి అధికారాలు ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి లోబ‌డే అన్ని వ్యవస్థలు పని చేయాల‌ని అంబ‌టి పేర్కొన్నారు.

Related Posts