వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యం: నిమ్మగడ్డ
హైదరాబాద్ మే 29
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చినట్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యమని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఈ సంస్థల సమగ్రతను కాపాడాలని సూచించారు.