కక్ష సాధింపులు మానాలి
- అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం మే 30
న్యాయం, ధర్మాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నియంత అయిన జగన్ చెంపచెల్లుమంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని కళ్లుతెరిచి మంచి పరిపాలన చేయాలని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎన్నికల కమిషన్ మార్పు దస్త్రంపై గవర్నర్ కళ్లుమూసుకుని సంతకం చేశారు. రానున్న రోజుల్లో అయినా గవర్నర్ దస్త్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు పునరాలోచన చేయాలని అయన వ్యాఖ్యానించారు.రాష్ట్రాన్ని పాలించటం జైళ్లో ఉన్నంత తేలిక కాదన్నది జగన్ గ్రహించాలి. కక్షసాధింపులు ఇకనైనా మాని దౌర్జన్యాలు వీడి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తే అందరికీ మంచిది. ఆప్తులైన సుబ్బారెడ్డి, ఏ2 ఆగడాలు మితిమీరాయని గ్రహించాలి. వీరిద్దరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని తెలిసి కూడా మాట్లాడటంలేదంటే జగన్ ప్రోత్సాహం ఉందని స్పష్టమవుతోందని అయన అన్నారు.