YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 టీడీపీకి కష్టమే : నాగబాబు

 టీడీపీకి కష్టమే : నాగబాబు

 టీడీపీకి కష్టమే : నాగబాబు
హైద్రాబాద్, మే 30,
జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు టీడీపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమంటూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి ఆ పార్టీనే వస్తుందా, జనసేన పార్టీ వస్తుందా.. బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి. ఒక్కటి మాత్రం నిజం టీడీపీ రాదని తన గట్టి నమ్మకం అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమీ లేదన్నారు. డెవలప్‌మెంట్ అంత అనుకూల టీవీల్లోను, పత్రికల్లోనే కనబడేది అని విమర్శించారు.గ్రౌండ్ లో కనిపించింది తక్కువ.. అలాగే అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి అన్నారు నాగబాబు. ఈ ట్విట్టర్ ఏం సరిపోతుందిది.. లక్ష పేజీల గ్రంథాలే రాయొచ్చని.. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి అన్నారు. ‘ఇక తర్వాత మేం వస్తాం మాదే రాజ్యం లాంటి కలల్లో నుంచి బయటకి రావాలి.. లేదు మేము ఇలాంటి పగటి కలల్లోనే జీవిస్తాం అనుకొంటే వాళ్లకు స్వాగతం. కానీ మానసిక శాస్త్రంలో అలాంటి వాటిని హల్యూసినేషన్ అంటారు. అల్ ది బెస్ట్ ఫర్ యువర్ హల్యూసినేషన్ ’అంటూ ట్వీట్ చేశారు.మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసిన నాగబాబు ఇప్పుడు ఉన్నట్టుండి టీడీపీని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీని వెనుక కారణాలపైనా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బాలయ్య చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ టాపిక్ ఇటు డైవర్ట్ అయ్యిందనే చర్చ మొదలైంది. మరి నాగబాబు ఇదే రూట్‌లో వెళతారా లేదా అన్నది చూడాలి.

Related Posts