YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ చేతగానితనంతో రాష్ట్రం దివాలా

సీఎం జగన్ చేతగానితనంతో రాష్ట్రం దివాలా

సీఎం జగన్ చేతగానితనంతో రాష్ట్రం దివాలా
-పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు
-టిడిపి 53% కేపిటల్ ఎక్స్ పెండిచర్ పెంచితే, వైసిపి 50% కోతలు పెట్టింది -రైతులకు ఎంఎస్ పి లేక రూ 15వేల కోట్ల నష్టం-జగన్మోసంతో రూ20వేల కోట్ల నష్టం -పాలన చేతగాకే టిడిపిపై వైసిపి బురద జల్లుతోంది పిల్లిగింతలు-కుప్పిగంతులు మానుకోవాలి రాష్ట్రం రాబడులు పెంచడంలో, రెవిన్యూ వ్యయంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది.టిడిపి పాలనలో మొత్తం బడ్జెట్ వ్యయం 11.6% పెంచాం. (రూ 1.46లక్షల కోట్ల నుంచి రూ 1.63లక్షల కోట్లకు పెరిగింది). అదే వైసిపి ఏడాది పాలనలో కేవలం 1.80% పెంచారు. (రూ 1.63లక్షల కోట్ల నుంచి రూ 1.66లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది).అంటే టిడిపి హయాంలో మొత్తం బడ్జెట్ వ్యయం ఏడాదికి రూ 17వేల కోట్లు పెరిగితే, వైసిపి పాలనలో కేవలం రూ 3వేల కోట్లు మాత్రమే పెరిగింది.టిడిపి హయాంలో మొత్తం రెవిన్యూ రిసిప్ట్స్ 11.6% పెరగగా వైసిపి ఏడాది పాలనలో కేవలం 1.8%మాత్రమే పెరిగాయి.బారోయింగ్స్ టిడిపి పాలనలో 30.70% పెంచితే, వైసిపి ఏడాది పాలనలో  135% పెంచేశారు.రెవిన్యూ వ్యయం టిడిపి హయాంలో 40% పెరిగింది.  (రూ1. 21లక్షలకోట్ల నుంచి రూ1.26లక్షల కోట్లకు పెంచాం). వైసిపి ఈ ఏడాది పాలనలో రెవిన్యూ వ్యయం 42% పెంచారు. పెద్దఎత్తున వాలంటీర్లను, సచివాలయ సిబ్బందికి ప్రజాధనం దోచిపెట్టడం వల్లే రెవిన్యూ వ్యయం పెరిగింది తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల సంక్షేమానికి చేసిందేమీ లేదు, పైగా కోతలు విధించారు.రెవిన్యూ రిసిప్ట్స్ మైనస్ బారోయింగ్స్ టిడిపి ఏడాది హయాంలో రూ 1.20లక్షల కోట్లనుంచి రూ 1.26లక్షల కోట్లకు పెరిగితే , వైసిపి ఏడాది పాలనలో రూ 86వేల కోట్లకు పడిపోయింది.కేపిటల్ ఎక్స్ పెండిచర్ టిడిపి 53%పెంచితే, వైసిపి 50% కోత పెట్టింది:కేపిటల్ ఎక్స్ పెండిచర్ టిడిపి పాలనలో 53% పెరిగింది. వైసిపి ఈ ఏడాది మైనస్ 50% తగ్గించేశారు. మూలధన వ్యయం పడిపోవడమే అభివృద్ది నిర్వీర్యం కావడానికి నిదర్శనం.వచ్చిన ఈ మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేశారు. సంపద సృష్టికి జరిగిన కృషి శూన్యం. అనుత్పాదక వ్యయం చేశారే తప్ప ఉత్పాదక వ్యయం పూజ్యం. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులకు వేలకోట్లు దుర్వినియోగం. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ముసుగులో వైసిపి కార్యకర్తల జీతాలకు ఏడాదికి రూ 4వేల కోట్ల దుర్వినియోగం. ఈ మొత్తంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరో 10% పూర్తయ్యేది.సాగునీటి ప్రాజెక్టులకు టిడిపి ప్రభుత్వం కన్నా బడ్జెట్ తక్కువ కేటాయించారు. కేటాయించిన రూ 16,128కోట్లలో రూ3,566కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పోలవరంపై టిడిపి ప్రభుత్వం అడ్వాన్స్ గా ఖర్చుపెట్టిన మొత్తం రూ3వేల కోట్లలో కేంద్రం రీయింబర్స్ చేసిన రూ 1,850 కోట్లను పోలవరం పనులపై ఖర్చుచేయకుండా వేరే పథకాలకు మళ్లించారు.రెవిన్యూ లోటును రూ 41వేల కోట్లనుంచి రూ70వేల కోట్లకు పెంచారు.కరోనా ప్రభావం గత ఆర్ధిక సంవత్సరంలో  చివరి 9రోజులు మాత్రమే. లాక్ డౌన్ ల వల్ల రాబడి తగ్గిందని కరోనాపై మోపడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఏదైనా కరోనా ప్రభావం ఉంటే అది వచ్చే ఆర్ధిక సంవత్సరంపైనే తప్ప గడిచిన ఏడాదిపై కాదు.ఏడాదిలో టిడిపి కంటె మూడున్నర రెట్లు ఎక్కువ అప్పులు:ఏడాదికి టిడిపి ప్రభుత్వం సగటున రూ 24వేల కోట్లు అప్పులు చేస్తే, వైసిపి ప్రభుత్వం ఏడాదిలోనే రూ87వేల కోట్ల అప్పులు చేసింది. టిడిపి కంటె మూడున్నర రెట్లు ఎక్కువగా అప్పులు చేసిన వైసిపికి, టిడిపిని విమర్శించే నైతికత ఎక్కడిది..?తన చేతగానితనంతో సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. చివరికి భూములు అమ్మే దుస్థితికి దిగజార్చారు. రాష్ట్రం దివాలా తీసిందా అని హైకోర్టు ప్రశ్నించడమే ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థానికి, వైసిపి చేతగానితనానికి నిదర్శనం.ఎంఎస్ పి లేక రైతులు రూ 15వేల కోట్లు నష్టం-వైసిపి మోసంతో రూ 20వేల కోట్ల నష్టం:వైసిపి ఏడాది పాలనలో మద్దతు ధర లభించక రాష్ట్రంలో రైతులు  రూ 15వేల కోట్లు కోల్పోయారు. రైతు భరోసా ముసుగులో చేసిన మోసంలో రూ 20వేల కోట్లు నష్ట పోయారు. టిడిపి ప్రభుత్వం వస్తే ఒక్కో రైతుకు రూ లక్షా 10వేలు వచ్చేది, వైసిపి రావడం వల్ల ప్రతి రైతు రూ 75వేలు కోల్పోయారు. అంటే రైతాంగానికి రెండిందాలా రూ 35వేల కోట్ల నష్టం జరిగింది. ధాన్యం క్వింటాల్ కు రూ 600 నష్టానికి అమ్ముకున్నారు. అంటే టన్నుకు రూ 6వేల నష్టం. ధాన్యం దిగుబడి 55లక్షల టన్నులు. అంటే ధాన్యం రైతులకే రూ 3,300కోట్లు నష్టం. మొక్కజొన్న క్వింటాల్ కు  రూ 400 నష్టం. మొక్కజొన్న దిగుబడి 14.5లక్షల టన్నులు. అంటే మొక్కజొన్న రైతులు రూ 58కోట్లు కోల్పోయారు.వేరుశనగ రూ 590 నష్టానికి అమ్ముకున్నారు. మినుములు రూ700 నష్టానికి అమ్ముకున్నారు. తెల్లజొన్న క్వింటాకు రూ 800నష్టం. మిర్చి టన్నుకు రూ 14వేలు నష్టం. క్వింటాల్ ఉల్లికి రూ1000నష్టం. టమాటా క్వింటాకు రూ 10వేల నష్టం.అరటి టన్నుకు రూ 12వేల నష్టం. బొప్పాయి టన్నుకు రూ 11వేల నష్టం. బత్తాయి టన్నుకు రూ 32వేల నష్టం. బంగినపల్లి మామిడి టన్నుకు రూ 30వేల నష్టం.బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పుచ్చ పంటను 30%-50% నష్టాలకు రైతులు అమ్ముకున్నారు. అరటి, పుచ్చ రైతులు ఎకరానికి రూ 70వేల నుంచి రూ లక్ష నష్టపోయారు.ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. 100కౌంట్ రొయ్యలు కిలోకు రూ110నష్టం. 40కౌంట్ రొయ్యలకు రూ 160నష్టం. కొనేవారు లేక రొయ్యలను ఎండబెడుతున్నారు.సెరికల్చర్ రైతులు రూ 50వేల నుంచి రూ లక్షన్నర నష్టం పోయారు. ఏడాదిలోనే వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీశారు.ఏడాదిగా ఆదాయం నిల్ - అభివృద్ది నిల్:ఆదాయమే లేకుండా చేసినప్పుడు రాష్ట్రంలో అభివృద్దికి అవకాశం ఎక్కడ ఉంది..? ఏడాది పాలనలో ఆదాయం నిల్, అభివృద్ది నిల్. ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ డెఫిసిట్ పెంచేశారు. వడ్డీల భారం పెంచారు, భవిష్యత్ చెల్లింపులు పెంచేశారు. గ్రాస్ ఫిస్కల్ కేపిటల్ ఫార్మేషన్ ను నిర్లక్ష్యం చేశారు.ఆదాయాలు లేవు, పెట్టుబడులు లేవు. ప్రభుత్వ ఆదాయం లేకుండా చేశారు కాబట్టి ప్రభుత్వ పెట్టుబడులు పడకేశాయి.  ప్రైవేటు పెట్టుబడులను బెదిరించి తరిమేశారు. పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి వెనక్కి తరలిపోయాయి. మూలధన అభివృద్దిని నిర్లక్ష్యం చేశారు.పెండింగ్ పారిశ్రామిక రాయితీలు తామే చెల్లించినట్లు సీఎం జగన్ గొప్పలు హాస్యాస్పదం. గత ప్రభుత్వాల పెండింగ్ బకాయిలు, అప్పులపై వడ్డీల చెల్లింపులు కొత్తకాదు. పాలన జగన్ కు కొత్త కాబట్టి ఇదంతా కొత్తగా అనిపించి వింత చేష్టలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వ పారిశ్రామిక పెండింగ్ రాయితీలు రూ 3,675కోట్లు 28,083పరిశ్రమలకు టిడిపి ప్రభుత్వం చెల్లించిందని వైసిపి ప్రభుత్వం 2019జులైలో విడుదల చేసిన శ్వేతపత్రంలోనే పేర్కొంది. టిడిపి ప్రభుత్వ పెండింగ్ బకాయిలు రూ 4వేల కోట్లు తాము చెల్లించామని జగన్ చెప్పడం హాస్యాస్పదం. పిల్లిగింతలు-కుప్పిగంతులు మానుకోవాలి:మసిబూసి మారేడు కాయ చేయడంలో జగన్ సిద్దహస్తుడు. పాలన చేతగాక పిల్లిగింతలు వేస్తున్నారు. కరోనా కష్టాల్లో ప్రజలు ఉంటే కోతిమూకతో కుప్పిగంతులు వేశారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. వైసిపి నిర్వాకాలకు తగిన గుణపాఠం చెబుతారు.

Related Posts