శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన మంత్రి అనిల్
శ్రీశైలం జూన్ 1,
ఆంద్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. తరువాత జలాశయంలోని నీటిలో నుంచి ప్రకాశం జిల్లాలోని వెలిగోండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ ను పరిశీలించేందుకు నల్లమల అడవుల నుంచి పచ్చని కొండల మద్య జలాశయంలోని నీటిలో బోటు ప్రయాణం చేశారు. నీటిలో సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెలిగొండ ప్రాజెక్టులో జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్, నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం డ్యాం ఇంజనీర్లు పాల్గొన్నారు. స్దానిక పోలీసులు మంత్రులకు గట్టి బందాబస్తు ఏర్పాటు చేసారు. మద్యాహ్నం తిరిగి శ్రీశైలం డ్యాంకు బోటు ప్రయాణంలో చేరుకుని సున్నిపెంటలోని నీటిపారుదల శాఖ అతిధి గృహంలో డ్యాం అధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు